రైలు పట్టాలమీద చచ్చిపోదాం అని ఇలా చేసాడు | చివరకి ఏం అయ్యిందో చూడండి

రైలు పట్టాలమీద చచ్చిపోదాం అని ఇలా చేసాడు | చివరకి ఏం అయ్యిందో చూడండి
రైల్వేబోర్డు చైర్మన్ రాజీనామా చేసినా ఆగలేదు.. ఏకంగా మంత్రిగారి శాఖను మార్చినా ప్రయోజనం కనిపించలేదు. రైళ్లు పట్టాలు తప్పుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సాంకేతికంగా ఎంత ముందడుగు వేసినా, ఈ ఒక్క విషయంలో మాత్రం ప్రగతి చూపిం చలేకపోతున్నాము. విద్రోహచర్యలే కారణం అవుతున్నాయో, పట్టాల నిర్వహణలో వైఫల్యమే దారితీస్తోందో గానీ ప్రమాదాలు మాత్రం వరుసపెట్టి సంభవిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రమాదాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. ఒకవైపు ఆస్పత్రులలో మరణాలు, మరోవైపు రైలు ప్రమాదాలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గత నెలలో వరుసపెట్టి నాలుగు రోజుల్లోనే రెండు పెద్ద రైలు ప్రమాదాలు సంభవించగా, తాజాగా గురువారం మరో రైలు పట్టాలు తప్పింది. హౌరా-జబల్ పూర్ మధ్య నడిచే శక్తికుంజ్ ఎక్స్ ప్రెస్ సోన్ బాంద్రా వద్ద ప్రమాదానికి గురైంది. గురువారం తెల్లవారుఝామున ఒబ్రా రైల్వే స్టేషన్ వద్ద రైలుకు సంబంధించి ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెబుతున్నారు. పట్టా విరిగిపోయి ఉండటంతో ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

సురేష్ ప్రభు నుంచి పియూష్ గోయల్ పదవీ బాధ్యతలు చేపట్టాక చోటు చేసుకున్న తొలి ప్రమాదం ఇదే. ఉదయం 6.25 సమయంలో ఘటన చోటు చేసుకుంది. ఉండాల్సిన స్థానంలో ఫిష్ ప్లేటు లేకపోవడం, అసలు ఏకంగా పట్టానే కొంత ముక్క విరిగిపోయినట్లుగా పక్కకు ఉండటాన్ని బట్టి చూస్తుంటే ఇది విద్రోహ చర్య కావచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఏకంగా ఏడు బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయినా.. ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం అదృష్టం. ఎందుకంటే, ఉత్తరప్రదేశ్ లోనే ఇంతకుముందు జరిగిన రెండు ప్రమాదాలలోను మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఉత్కళ్ ఎక్స్ ప్రెస్ లోని 14 బోగీలు పట్టాలు తప్పడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 97 మంది గాయపడ్డారు. అలాగే కైఫియత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన మార్గం చాలా ముఖ్యమైనది. 

Comments