సినిమా ప్రమోషన్ కోసమే వైజాగ్ వెళ్ళాడు | ఈరోజు పవన్ కళ్యాణ్‌పై మళ్ళీ కత్తి మహేష్ సంచలనం వాక్యాలు

సినిమా ప్రమోషన్ కోసమే వైజాగ్ వెళ్ళాడు | ఈరోజు పవన్ కళ్యాణ్‌పై మళ్ళీ కత్తి మహేష్ సంచలనం వాక్యాలు 
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్ మరోసారి రెచ్చిపోయారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ ఆయన మీడియాలో నానుతున్న విషయం తెలిసిందే. పవన్‌పై విమర్శలు చేస్తూ క్రేజ్ సంపాదించుకోవాలని భావిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో కత్తి మహేష్ స్పందించారు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన ప్రజలకు సేవ చేసేందుకేనని చాలామంది అంటున్నారని ప్రశ్నించారు. దానికి కత్తి మహేష్ స్పందించారు. ఆ చాలామంది ఎవరో తనకు తెలియదని, పవన్ హీరోగా రూపొందుతున్న అజ్ఞాతవాసి చిత్రం ఆడియో త్వరలో ఉందని గుర్తు చేశారు.
అలానే అజ్ఞాతవాసి చిత్రం త్వరలో విడుదల కానుందని కత్తి మహేష్ చెప్పారు. ఏక్ పంత్ దో కాజ్ అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. అటు రాజకీయంగా లాభం ఉంటుందని, ఇటు సినిమా పరంగా ప్రమోషన్ అవుతుందని లెక్క చెప్పారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టడమనేది తప్పు కాదని కత్తి మహేష్ అన్నారు. అసలే టైమ్ తక్కువగా ఉందని, రెండింటికి పనికి వచ్చే పని చేస్తుంటే అంతకన్నా ఏం కావాలని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నారని కత్తి మహేష్ అన్నారు. ఇప్పటికైనా ఆయన జనాల్లోకి వెళుతున్నారని, జనాల్లోకి వెళ్లడం ఆయనకు రెండు రకాలుగానూ ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.


Comments